Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వెంటే తెలంగాణ.. మంత్రి హరీష్ రావు ట్వీట్..

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 15 రౌండ్లకు గానూ 11 రౌండ్ల  కౌంటింగ్ పూర్తైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 

Minister Harish Rao Tweets Telangana With KCR
Author
First Published Nov 6, 2022, 3:54 PM IST

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 15 రౌండ్లకు గానూ 11 రౌండ్ల  కౌంటింగ్ పూర్తైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కేసీఆర్ వెంటే తెలంగాణ (#TelanganaWithKCR) అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ ఫొటోను పోస్టు చేశారు. ఆ ఫొటోలో హరీష్ రావు వెనకాల గోడపై కేసీఆర్ ఫొటో ఉంది. హరీష్ రావు ఏదో పత్రాలను పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక, పలువురు టీఆర్ఎస్ నాయకులు సైతం కేసీఆర్‌తో తాము ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. #TelanganaWithKCR ట్యాగ్‌ను ట్వీట్‌ చేస్తున్నారు. 

మునుగోడులో కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమైందని భావిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. హైదరాబాద్‌లోని తెలంగా భవన్‌కు భారీగా చేరుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు.. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. దేశ్ కీ  నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలంగాణ భవన్‌కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 

 

ఇక, మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ విషయానికి వస్తే.. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 5,700కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో నాలుగు రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios