కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలైనా ఇచ్చి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇస్తే అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని ఈటల అన్నారు.  

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలైనా ఇచ్చి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇస్తే అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని ఈటల అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమలుకు సాధ్యంకానీ హామీలిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. షార్ట్‌ కట్‌లో అధికారంలోకి రావడం కోసం కులాల ప్రస్తావన తెస్తున్నారని ఈటల మండిపడ్డారు. కుల రాజకీయాలు చేసేవారు నిలబడరన్నారు. తమ యావ, ధ్యాస అంతా తెలంగాణ అభివృద్ధి పైనేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.