లాక్ డౌన్ పొడిగింపు.. హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!
నిన్నటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కావాల్సిన వస్తువులు తీసుకువచ్చుకునే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు.. దానిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చారు. ఈ నేపథ్యంలోనే మెట్రోవేళల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరో పది రోజులపాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మెట్రోవేళ్లల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని గంటలు మాత్రం సడలింపు ఇచ్చారు. నిన్నటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కావాల్సిన వస్తువులు తీసుకువచ్చుకునే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు.. దానిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చారు. ఈ నేపథ్యంలోనే మెట్రోవేళల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగించి నడుపుతామని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9.45 వరకు నడుస్తున్న రైళ్లు నడుస్తున్నాయని, లాక్డౌన్ సడలింపు సమయం పెంచిన నేపథ్యంలో సోమవారం నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నడిపిస్తామని వెల్లడించారు.
ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య సైతం ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సమయం ఇవ్వడంతో ఆ టైంలోనూ రైళ్లను నడిపేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు