కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సంఘటనాస్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు గుంటూరు రవిగా పోలీసులు గుర్తించారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టు పార్టీ విస్తరణ కోసం దళం గుత్తికోయ గ్రామాల్లో తిరుగుతోందని వెల్లడించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 21, 2019, 10:33 AM IST