కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ నెల 15న హైద్రాబాద్ కు రానున్నారు. పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.  రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలతో పాటు రాహుల్ టూర్ పై ఠాగూర్ చర్చించనున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ Telangana రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ Manickam Tagore ఈ నెల 15న హైద్రాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు Congress పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. 

ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ కమిటీ చైర్మెన్లతో మాణికం ఠాగూర్ సమావేశం కానున్నారు. ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో మాణికం ఠాగూర్ భేటీ కానున్నారు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీ నేతల మధ్య బేదాభిప్రాయాల విషయమై ప్రస్తావించారు. అయితే తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని Rahul Gandhi పార్టీ నేతలకు సూచించారు. 

Karnataka , తెలంగాణ రాష్ట్రాలకు Sunil ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకుంది.రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సునీల్ ఇప్పటికే రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ అవలంభించాల్సిన వ్యూహాంపై రాహుల్ గాంధీ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 

ఈ నెల 15న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు నిర్వహించే సమావేశంలో భవిష్యత్తులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ నెల 16న నిర్వహించే సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుండే అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో ఠాగూర్ చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్తగా సునీల్ ను నియమించుకున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నాయకత్వానికి సునీల్ టీమ్ దిశానిర్ధేశం చేయనుంది.

తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులు TRS, BJP, కాంగ్రెస్ తో పాటుఇతర పార్టీల స్థితిగతులపై సునీల్ ఇప్పటికే రాహుల్ గాంధీకి నివేదికను ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన రాష్ట్రానికి చెందిన నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సమయంలో ఈ నివేదిక ఆధారంగా పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో వీలైనన్నీ ఎక్కువ సార్లు పర్యటిస్తానని కూడా రాహుల్ ఈ సందర్శంగా పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ ఏడాది మే 4,5 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మే 4న వరంగల్ లో నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటారు. మే 5న హైద్రాబాద్ బోయిన్ పల్లి నిర్వహించే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ టూర్ విషయమై కూడా ఠాగూర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.