మంచిర్యాల యువకుడి దారుణహత్య కేసులో.. నిందితుల అరెస్ట్...
మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో ముస్కె మహేష్ అనే యువకుడిని గొంతుకోసి, బండతో తలమీద కొట్టి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
![mancherial murder case accussed arrest- bsb mancherial murder case accussed arrest- bsb](https://static-ai.asianetnews.com/images/01gyejxt3kgmtwb6tbfnvrq6ty/arest_363x203xt.jpg)
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా ఇందారంలో బుధవారం నాడు జరిగిన మహేష్ అనే వ్యక్తి దారుణ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మహేష్ హత్యకేసులో నిందితులుగా అదే గ్రామానికి చెందిన కనకయ్య, ఆయన భార్య పద్మ.. కూతుర్లు శ్వేత, శృతి, కొడుకు సాయిలులను పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ ఎసిపి నరేందర్ ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతుడు మహేష్.. కనకయ్య, పద్మల కూతురు శృతి గతంలో ప్రేమించుకున్నారు. వీరి మధ్య ఏర్పడిన చనువుతో న్యూడ్ వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకున్నారు.
ఈ వీడియోలను మహేష్ సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో శృతి కుటుంబం షాక్ అయింది. ఇంతగా అవమానపరిచిన మహేష్ ను ఎలాగైనా చంపాలని అనుకున్నారు. పక్కా పథకం ప్రకారం ఇంటి నుంచిబయటికి వెళ్తున్న మహేష్ను అటకాయించి.. గొంతు కోసి, ఆ తర్వాత బండరాయితో మోది ముక్కుమ్మడిగా హత్యకు పాల్పడ్డారు. వివాహిత శృతిని వేధిస్తున్నాడని ఈ హత్య జరిగినట్లుగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేసు విచారణలో పెళ్లికి ముందే యువతి, మహేష్ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని తేలింది.
దీంతోనే కుటుంబ సభ్యులు శృతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారని.. అది తట్టుకోలేని మహేష్ యువతి భర్తకు తమ వీడియోలు ఫోటోలు పంపించాడని తేలింది. అవి చూసిన యువతి భర్త అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ వీడియోలు పంపడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. దీంతోనే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మహేష్ను బండరాయితో కొట్టి చంపారు. మహేష్ మీద దాడి చేయడం హత్య చేయడం కొందరు వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
మంచిర్యాల యువకుడి హత్య : యువతి వీడియోలు భర్తకు పంపడంతో ఆత్మహత్య.. ఆ కక్షతోనే బండరాయితో మోది..
ఇదిలా ఉండగా, మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో మంగళవారం ముస్కె మహేష్ అనే యువకుడిని గొంతుకోసి, బండతో తలమీద కొట్టి హత్య చేశారు దుండగులు. ఈ హత్యకు ప్రేమవ్యవహారం, వేధింపులే కారణమని తెలుస్తోంది. ఈ హత్యను లైవ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ మీద వెడుతున్న యువకుడికి బండరాయితో కొట్టి.. ఆ తరువాత గొంతుకోసి హత్య చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.
కాగా, మృతుడు మహేష్ కుటుంబ సభ్యులు పోలీసులను నిలదీస్తున్న మరో వీడియో కూడా వెలుగు చూసింది. తమ కొడుకు చావుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని.. వారే తమ కొడుకును పొట్టనపెట్టుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికి తెలిసిన వివరాల ప్రకారం....
మంచిర్యాలజిల్లా, జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు అతడిని మందలించి.. ఆ తరువాత యువతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఇటీవల యువతి గ్రామానికి వచ్చి, తల్లిగారింట్లో ఉంటోంది.
కొద్ది రోజులు బాగానే ఉన్న మహేష్.. మళ్లీ వివాహితకు అసభ్య మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో యువతి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు.. మహేష్ బండి మీద వస్తుండగా దారిలో అటకాయించారు. పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుమీద అందరూ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డారు.