తన సోదరుడికి రాఖీ కట్టడానికి ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి వెళ్లింది. అది గమనించిన వీరస్వామి వారి ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఈ విషయాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది.
ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి.. ఇంటి యజమాని కూతురిపైనే కన్నేశాడు. కనీసం ఆ యువతికి మతిస్థిమితం కూడా లేదన్న విషయాన్ని మరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... పోలీసులు అతనిని పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) మూడు నెలల క్రితం రహమత్నగర్ ప్రాంతంలో అద్దె గదిలో నివసిస్తున్నాడు. అతని వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ భార్యతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఇక్కడ ఒక్కడే నివసిస్తూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
అతను నివసించే ఇంటి యజమానురాలికి మతిస్థిమితం లేని కుమార్తె(30) ఉంది. గురువారం తన సోదరుడికి రాఖీ కట్టడానికి ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి వెళ్లింది. అది గమనించిన వీరస్వామి వారి ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఈ విషయాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అప్పటికే అది గమనించిన వీరస్వామి అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 17, 2019, 8:11 AM IST