Asianet News TeluguAsianet News Telugu

భర్తను, పిల్లల్ని చంపుతానని బెదిరించి.. వివాహితపై కామాంధుడి అత్యాచారం..

హనుమకొండలో దారుణం జరిగింది. వివాహితను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తి.. భర్తను, పిలల్ని చంపేస్తానని బెదిరించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. 

man molested married woman threatening to kill her husband and children in hanamkonda
Author
Hyderabad, First Published May 10, 2022, 12:04 PM IST

హనుమకొండ : భర్తను పిల్లలను చంపుతానని బెదిరించి married womanపై ఓ యువకుడు molestedకి పాల్పడ్డాడు. hanamkonda జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని  ముల్కనూర్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ సోమవారం  ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో  సదరు బాధిత వివాహిత కిరాణా షాప్ నడుపుతోంది. ఆమె భర్త క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ఆమెతో ప్రత్యక్షంగానూ, ఫోన్లోనూ అసభ్య కరంగా మాట్లాడుతూ ఉండేవాడు.  

ఈ విషయమై పలుమార్లు పంచాయితీ పెట్టించింది. ఇక ముందు అలా మాట్లాడని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకునేవాడు. ఆ తర్వాత అలాగే ప్రవర్తించేవాడు. భర్త ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కరుణాకర్ ఆమె ఇంటికి వెళ్లాడు పరిస్థితి భర్తను పిల్లలను చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా, సోమవారం exams ముగించుకుని ఇంటికి వెడుతున్న 12 యేళ్ల బాలికను అపహరించి రెండ్రోజులపాటు gang rapeకు పాల్పడిన దారుణ ఘటన... rajastanలోని భరత్పూర్ జిల్లాలో జరిగింది. 19 ఏళ్లు, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు పరీక్ష రాసేందుకు ఇటీవల పాఠశాలకు వెళ్లారు. పరీక్ష ముగియగానే ఇంట్లోకి కావలసిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి ఇద్దరు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు స్వగ్రామానికి బయలుదేరారు. వారిని దారిలో  అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు 12 ఏళ్ల బాలికను  అపహరించారు.  ఇంటికి చేరిన 19 ఏళ్ల యువతి జరిగిన సంఘటన గురించి నాయనమ్మకు తెలిపింది. 

దీంతో ఆమె నేరుగా నిందితుడు ఇంటికి వెళ్లి తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసినట్టు కుటుంబసభ్యులు,  బంధువులకు చెప్పింది.రెండు రోజుల్లో అప్పగిస్తామని వారు హామీ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన బాధిత బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని నాయనమ్మకు వివరించింది. నిందితులు  ముగ్గురిపై  పోక్సో చట్టం కింద కేసు. నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నామని స్టేషన్ ఇంచార్జ్ వినోద్ కుమార్ మీనా తెలిపారు. 

కాగా, తమిళనాడులో ఇలాంటి దారుణమే జరిగింది. మే 7న  బాలికపై molestationకి పాల్పడిని ఇద్దరు వృద్ధులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని మధురైకి సమీపంలో ఓ ప్రాంతానికి చెందిన 15యేళ్ల బాలిక father చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటోంది. ఆకస్మికంగా బాలికకు Stomach ache రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె ఐదు నెలల Pregnant అని నిర్థారించారు. బాధితురాలి తల్లి జరిగిన విషయం గురించి ఆరా తీసింది. 

ఇంటికి సమీపంలో ఉంటున్న బాలమురుగన్ అనే వృద్ధుడు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ విషయం గురించి తెలుసుకున్న తండ్రి స్నేహితుడైన రమేష్ అనే వ్యక్తి కూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడయ్యింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ శుక్రవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios