భార్యతో తన లైంగిక వాంఛ తీర్చాలని అతనికి ఆదేశించాడు. 

రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం లో ఏనుగులదొరి గ్రామంలో జరిగిన పాటి జానిరెడ్డి హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు..స్నేహితుడే జానిరెడ్డిని హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. జానిరెడ్డి, మాదాను ఆరోగ్యం.. ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ హోమో సెక్స్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో తనకు డబ్బులు కావాలని మాదాను ఆరోగ్యంను కోరాడు జానిరెడ్డి. అంతేకాకుండా డబ్బుతోపాటు మాదాను ఆరోగ్యం భార్యతో తన లైంగిక వాంఛ తీర్చాలని అతనికి ఆదేశించాడు. లేకపోతే తమ అనైతిక బంధాన్ని అందరికి చెప్తానంటూ బెదిరించాడు. ఇదిలావుంటే పోకిరి సినిమాలో ఒక సన్నివేశాన్ని తలపించేలా.. మంచానికి కాళ్ళు చేతులు కకట్టేసి తన లైంగిక వాంఛలు తీర్చమని మాదాను ఆరోగ్యంను అడిగాడు జానిరెడ్డి. అప్పటికే అతడి ప్రవర్తనతో విసుగు చెందిన ఆరోగ్యం తన వద్దనున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred