రైలుకి ఎదురెళ్లి సెల్ఫీ.. యువకుడు దుర్మరణం
ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శాలిబండకు చెందిన దావూద్ శనివారం ఫలక్నూమా-గుల్బార్గ ప్యాసింజర్ రైలులో గుల్బార్గ వెళుతున్నాడు. ఆ సమయంలో ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ వస్తుండటంతో.. రైలు మంతట్టి రైల్వే స్టేషన్లో ఆగింది.
ఈ నేపథ్యంలో దావూద్కు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. రైలుకు ఎదురుగా నిలబడి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారు సరేననన్నారు. అయితే రైలు అమిత వేగంతో వచ్చి దావూద్ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.