ఫోన్ విషయంలో తోడికోడలు మధ్య జరిగిన వివాదం ముదిరి ఒకరి తండ్రిని బలితీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మండల పరిధిలోని ఆచార్లగూడెంలోని కొలికపొంగు శ్రీలత (భర్త రవితేజ), స్వర్ణకుమారి(భర్త రవికిరణ్) ఇద్దరూ తోడి కోడళ్లు. వీరి మధ్య ఫోన్ దొంగిలించారన్న  విషయమై ఈ నెల 23న గొడవ జరిగింది.

ఫోన్ విషయంలో తోడికోడలు మధ్య జరిగిన వివాదం ముదిరి ఒకరి తండ్రిని బలితీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మండల పరిధిలోని ఆచార్లగూడెంలోని కొలికపొంగు శ్రీలత (భర్త రవితేజ), స్వర్ణకుమారి(భర్త రవికిరణ్) ఇద్దరూ తోడి కోడళ్లు. వీరి మధ్య ఫోన్ దొంగిలించారన్న విషయమై ఈ నెల 23న గొడవ జరిగింది.

ఈ గొడవలో వారిద్దరి తండ్రులు ఘర్షణపడ్డారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు పరిష్కరించేందుకు వచ్చిన వారిద్దరూ తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీలత తండ్రి ఆచార్లగూడెం నివాసి అయిన జల్లేపల్లి గోవిందు (57) అలియాస్ వెంకన్నతో స్వర్ణకుమారి కుటుంబ సభ్యులైన రామచంద్రపురంగ్రామం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా నివాసులు పాలెపొంగు బాబు, జయమ్మ, నరేందర్, స్వర్ణకుమారి పెద్దమ్మ కుమారుడు రేపాల గ్రామవాసి నవీన్ ఘర్షణకు దిగారు. 

వీరిలో స్వర్ణకుమారి సోదరులు నరేందర్, నవీన్ శ్రీలత తండ్రి గోవిందును కాలితో బలంగా తన్నారు. దీంతో పక్కనే ఉన్న సి సి రోడ్డు మీద పడిన గోవిందు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గోవిందు కుటుంబ సభ్యులు అతన్ని నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఈ విషయం తెలుసుకున్న నేలకొండపల్లి ఎస్సై అశోక్ రెడ్డి, కూసుమంచి సీఐ సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.