జగిత్యాల జిల్లా ఇటిక్యాలలో దారుణం జరిగింది. డబ్బుకోసం ఓ వృద్ధురానికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలం ఇంటిక్యాలకు చెందిన పాలెపు శివమ్మ, నర్సమ్మలు ఒంటరి మహిళలు.

జగిత్యాల జిల్లా ఇటిక్యాలలో దారుణం జరిగింది. డబ్బుకోసం ఓ వృద్ధురానికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలం ఇంటిక్యాలకు చెందిన పాలెపు శివమ్మ, నర్సమ్మలు ఒంటరి మహిళలు.

అదే గ్రామానికి చెందిన అంతడుపుల రాజారాం (35)తో వీరికి పరిచయం ఏర్పడింది. అక్కాచెల్లెళ్ల దగ్గర 25గుంటల భూమి ఉంది. దీన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి రాజారం వీరి దగ్గర ఏడాదిక్రితం రూ.లక్ష తీసుకున్నాడు. అయితే ఏడాది గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో డబ్బు తిరిగివ్వాలని రాజారాంను ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎలాగైనా ఈ ఒంటరి మహిళల బాధ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో రాజారాం పథకం పన్నాడు. 

ముందుగా పాలెపు నర్సమ్మకు ఫిబ్రవరి 26న వేములవాడకు వెళ్దామని చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులకు చెప్పి వేములవాడకు వెళ్లింది. అయితే వేములవాడకు వెళ్లిన నర్సమ్మ తిరిగిరాలేదు. ఆ తరువాత అక్క పాలెపు శివమ్మను కూడా అంతం చేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 28న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని రాయికల్ రావాలని చెప్పి శివమ్మకు బైక్‌పై తీసుకెళ్లాడు.

తహసీల్దార్‌ మేడిపెల్లికి వెళ్లాడని అక్కడ సంతకాలు పెడతారని నమ్మించాడు. అక్కడినుంచి మేడిపల్లిలోని ఎస్సారెస్పీ కెనాల్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్ లోకి వెళ్లి ముఖం కడుక్కోవాలని చెప్పాడు. కెనాల్ లోకి వెళ్లగానే శివమ్మను రాజారాం వెనుక నుంచి తోసేశాడు. కెనాల్ లో కొట్టుకుపోతున్న శివమ్మ పక్కనే ఉన్న ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలతో బయటపడింది. 

తన చెల్లె కనిపించకపోవడం, తనను చంపాలని చూడడంతో రాజారాంపై అనుమానం వచ్చిన శివమ్మ మార్చి 1వ తేదీన తన చెల్లె నర్సమ్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై రాజారాం హత్యాయత్నం చేశాడని మరుసటి రోజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ నెల 4వ తేదీన రాజారాంను కస్టడీలోకి తీసుకున్నారు. 

ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపెల్లి శివారులోని గుట్టపై అటవీప్రాంతంలో గొంతునులిమి నర్సమ్మను చీరతో హత్య చేసినట్లు పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో హంతకుడిని, కుటుంబసభ్యులను సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. 

కుళ్లిపోయిన మృతదేహం చూపించగా కుటుంబసభ్యులు గుర్తించగా నర్సమ్మను రాజారాం హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, రాయికల్ ఎస్సై ఆరోగ్యం సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి అక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.