Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ కు మెలిక: రైతు బంధుకు వద్దని దీదీకి విహెచ్ విజ్ఞప్తి

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు బంధు కార్యక్రమానికి కాంగ్రెసు నేత వి హనుమంత రావు మెలిక పెట్టారు.

Mamata Banerjee told not to attend Rythu Bandhu programme

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు బంధు కార్యక్రమానికి కాంగ్రెసు నేత వి హనుమంత రావు మెలిక పెట్టారు. ఈ కార్యక్రమానికి రావద్దని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

మమతా బెనర్జీకే కాకుండా డిఎంకె నేత స్టాలిన్ కు, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను వారికి లేఖలు కూడా రాస్తానని చెప్పారు. గత నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, ఈ కార్యక్రమానికి హాజరైతే అన్యాయాన్ని ఆ నేతలు కూడా బలపరిచినట్లవుతుందని ఆయన అన్నారు 

ఎన్నికలకు ముందు కేసిఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వాటిని మరిచిపోయారని విహెచ్ అన్ారు రైతుల రుణాలను మాఫీ చేయలేదని, ఫీజు రీయంబర్స్ మెంట్ చేయలేదని అన్నారు. 

రాష్ట్రంలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధమైన సాయం చేయలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడతో కేసిఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios