సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం నాడు తన పాదయాత్రను ప్రారంంభించారు. పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మధ్యలో నిలిపివేసిన పాదయాత్రను ఆయన కొనసాగిస్తున్నారు.

ఖమ్మం: జిల్లాలోని మధిరలో CLP నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని మధ్యలోనే నిలిపివేసిన పాదయాత్రను ఇవాళ్టి నుండి ఆయన కొనసాగిస్తున్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన Mallu Bhatti Vikramarka మధిరలో తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ నెల 7వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ నెల 5వ తేదీ సాయంత్రానికి భట్టి వికరమార్క తన పాదయాత్రను నిలిపివేశారు.ఈ నెల 6వ తేదీన హైద్రాబాద్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు.

 రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు పాదయాత్రను ప్రారంభిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 

Madira నియోజకవర్గంలోని యడవల్లి గ్రామం నుండి భట్టి విక్రమార్క తన పాదయాత్రను ప్రారంభించారు. 33 రోజుల పాటు 135 గ్రామాల గుండా యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజల నుండి భట్టి విక్రమార్క ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలోనే భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా కారణంగా పాదయాత్రను భట్టి విక్రమార్క వాయిదా వేసుకొన్నారు. ఇవాళ్టి నుండి ప్రారంభించిన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని నామకరణం చేశారు భట్టి విక్రమార్క

ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులతో కలిసి మల్లు భట్టి విక్రమార్క యడవల్లి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి రోజూ 15 నుండి 20 కి.మీ దూరం భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగించారు.

 గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజులు ముగించిన తర్వాత పాదయాత్రను ముగించనున్నారు. ఇవాళ మధిరలోని వేణుగోపాలస్వామి ఆలయంలో మల్లుభట్టి విక్రమార్క పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్రను ప్రారంభించారు.