హైటెన్షన్ టవర్ బోల్టులు విప్పేసిన స్థల యజమాని... ఓఆర్ఆర్పై తప్పిన పెను ప్రమాదం
ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో విద్యుత్ హై టెన్షన్ టవర్ బోల్టులు విప్పేశాడు స్థల యజమాని. అయితే స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో విద్యుత్ హై టెన్షన్ టవర్ బోల్టులు విప్పేశాడు స్థల యజమాని. టవర్ 4 కాళ్లలో 3 కాళ్ల బోల్టులు తొలగించారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. విప్పిన బోల్టుల స్థానంలో అధికారులు కొత్తవి అమర్చడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.