Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పేరుతో మోసం.. యువతిని గర్భవతి చేసి.. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చివరకు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మబలికి భూక్యా  నందు అనే యువకుడు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రయత్నాల్లోనే చివరకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
 

love trap.. woman gets pregnant after lovers fake promise loses life while trying to abort
Author
First Published Aug 19, 2022, 5:51 PM IST

హైదరాబాద్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. సమీప గ్రామంలోని ఓ యువతిని బుట్టలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. వారిద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. తర్వాత ఆమెకు అబార్షన్ చేయించే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామావరం గ్రామానికి చెందిన యువతి, పూసుగూడేనికి చెందిన యువకుడు భూక్యా నందు మధ్య స్నేహం ఏర్పడింది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లుతానని భూక్యా నందు ఆ యువతికి తరుచూ చెప్పేవాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన తర్వాత వారిద్దరు శారీరకంగా కలిశారు. దీంతో ఆ యువతి గర్బం దాల్చింది. 

ఈ విషయం తెలిసిన తర్వాత భూక్యా నందు మరో పథకం వేశాడు. గర్భస్రావం కోసం ప్రయత్నించాడు. గర్భస్రావం కోసం ఆమెకు ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఆ యువతి ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నది. ఐదు నెలల గర్భం కావడంతో ఆమెకు అబార్షన్ కాలేదు. దీంతో కచ్చితంగా ఆమెకు అబార్షన్ చేయించాల్సిందేనని హాస్పిటల్ తీసుకెళ్లాడు.

భద్రాచలంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు ఆమెను తీసుకెళ్లాడు. హాస్పిటల్ వైద్యులకు భూక్యా నందు అబద్ధం చెప్పాడు. ఆమె తన భార్య అని, ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నదని నమ్మబలికాడు. వైద్యులు ఆమెను అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. కానీ, చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆమెకు ఫిట్స్ వచ్చింది. దీంతో ఆ యువతి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారింది. 

ఈ విషయం తెలుసుకున్న భూక్యా నందు, మరో మహిళ అక్కడి నుంచి పారిపోయారు. ఆ యువతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి ప్రాణం వదిలింది. కానీ, ఆమెను అడ్మిట్ చేసిన వారు పరారు కావడంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. 

పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. యువతి మరణం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. భూక్యా నందుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డను భూక్యా నందునే బలి తీసుకున్నాడని అన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం ప్రస్తుతం గాలింపులు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios