Asianet News TeluguAsianet News Telugu

"టీఆర్ఎస్ పార్టీ - కెసిఆర్" డాక్యుమెంటరీ సీడీని ఆవిష్కరించిన కవిత

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈ పార్టీ ప్రచారం కోసం ఇంగ్లాండ్ నుండి టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నారై బృందం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కేసీఆర్ ప్రస్థానం ఎలా సాగిందన్న దానిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ మరియు అభివృద్ధి గురించి రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. 
 

london trs nri members meeting with mp kavitha
Author
Hyderabad, First Published Nov 19, 2018, 7:01 PM IST

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈ పార్టీ ప్రచారం కోసం ఇంగ్లాండ్ నుండి టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నారై బృందం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కేసీఆర్ ప్రస్థానం ఎలా సాగిందన్న దానిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ మరియు అభివృద్ధి గురించి రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. 

london trs nri members meeting with mp kavitha

ఇవాళ ఎన్నారై బృందం కవితతో సమావేశమై ఎన్నికల ప్రచారం గురించి చర్చించారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో తాము నిర్వహించబోయే ప్రచారాన్ని గురించి వారు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా కవిత వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

london trs nri members meeting with mp kavitha

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సెల్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం,యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, నాయకులు మల్లేష్ పప్పుల పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios