Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ దెబ్బ: రూ. 12 వేల కోట్లకు వచ్చింది రూ. 3100 కోట్లేనన్న కేసీఆర్

లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇచ్చినా కూడ రాష్ట్రానికి పెద్దగా ఆదాయం రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాల్సిన అవసరం ఉందన్నారు.

lock down effect: 9000 crore loss to telangana government
Author
Hyderabad, First Published May 27, 2020, 8:51 PM IST


హైదరాబాద్: లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇచ్చినా కూడ రాష్ట్రానికి పెద్దగా ఆదాయం రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

‘‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినట్టుగా సీఎం చెప్పారు.

 ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు.రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.

 అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు.

 ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలని అధికారులకు ఆయన సూచించారు.

అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి.లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా అందించాల్సిందిగా కోరారు. 

also read:షాకిచ్చిన కేసీఆర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'మే'లో కూడ సగం జీతమే
    
లాక్ డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు  మళ్లీ పని దొరకుతుంది.దీంతో ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదని ఆయన తేల్చి చెప్పారు.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం వేతనాలను కోతలు విధిస్తూ మే మాసంలో జీతాలు చెల్లించాల్సిందిగా కోరారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios