ప్రభుత్వ లాంఛనాలతో శివశంకర్ అంత్యక్రిియలు
దశాబ్దాలపాటు పార్టీకి సేవలందించిన శివశంకర్ కు నేతలందరూ కడసారిగా నివాళులర్పించారు.
కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకు ముందు ఆయన పార్ధివదేహాన్ని కార్యకర్తల దర్శనం కోసం కాంగ్రెస్ నేతలు కొద్దిసేపు గాంధీభవన్ లో ఉంచారు.
దశాబ్దాలపాటు పార్టీకి సేవలందించిన శివశంకర్ కు నేతలందరూ కడసారిగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర పురానాపూల్ వరకు సాగగింది.అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.