Asianet News TeluguAsianet News Telugu

ఇవాళ పీఎం మోదీని కలుస్తా, ఆ రెండు విషయాలపై చర్చస్తా : కేటీఆర్

ట్వీట్టర్ ద్వారా వెల్లడించిన కేటీఆర్...

ktr tweeted about his pm meeting

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ పీఎం మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రధానితో తెలంగాణ లో చేపట్టాల్సిన అభివృద్ది పనుల గురించి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధానిని నేడు కలవనున్నట్లు కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ లో కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని కలిసి తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రెండు ముఖ్యమైన  అంశాల గురించి చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.  

ప్రధానిని కలిసేందుకు డిల్లీకి బయలుదేరి వెళుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణం తో పాటు హైదరాబాద్ లో ఐటీఐఆర్  ఏర్పాటుపై మోదీతో చర్చించి వాటిపై ఓ హామీని పొందేలా కృషి చేస్తానని కేటీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్దికి ఎంత అవసరమో ప్రధానికి వివరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios