Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వ్యవహారం '' ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే'' అన్నట్లుంది: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రజల సమాచారాన్ని తస్కరించినందుకే ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అందులో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు.  ఈ వ్యవహారంపై విచారణ జరిగితే తమ డేటా దొంగతనం ఎక్కడ  బయటపడుతుందోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని...అందుకోసమే విచారణను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

ktr fires on chandrababu on it grid case
Author
Hyderabad, First Published Mar 5, 2019, 2:27 PM IST

ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రజల సమాచారాన్ని తస్కరించినందుకే ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అందులో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు.  ఈ వ్యవహారంపై విచారణ జరిగితే తమ డేటా దొంగతనం ఎక్కడ  బయటపడుతుందోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని...అందుకోసమే విచారణను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

ఐటీ గ్రిడ్ వ్యవహారంపై  కేటీఆర్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ''మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?'' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 

మరో ట్వీట్ లో '' పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ?'' అంటూ కేటీఆర్ ఏపి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 
 
ఇదివరకే కేటీఆర్ ఈ వ్యవహారంతో తమేకేమీ సంబంధం లేదని...హైద్రాబాద్ లో ఉంటున్న లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి  ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారని  వివరించారు.  ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం హైద్రాబాద్‌లోనే ఉందని, ఈ సంస్థపై ఫిర్యాదు కూడా ఇక్కడే అందింది కాబట్టి తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేటీఆర్  గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు తెలంగాణలో పోలీసులను అడ్డుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో ఏపీ పోలీసులకు ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios