Asianet News TeluguAsianet News Telugu

వైఎస్‌ను ఇలాగే అడ్డుకున్నారు.. సీనియర్లకు చురకలు, రేవంత్‌కు కొండా సురేఖ బాసట

కాంగ్రెస్ సీనియర్లకు మాజీ మంత్రి కొండా సురేఖ చురకలు వేశారు. వైఎస్ పాదయాత్రను కూడా ఇలాగే అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. నాడు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారని సురేఖ గుర్తుచేశారు

konda surekha slams congress senior leaders over revanth reddy padayatra issue ksp
Author
Hyderabad, First Published Feb 16, 2021, 9:12 PM IST

కాంగ్రెస్ సీనియర్లకు మాజీ మంత్రి కొండా సురేఖ చురకలు వేశారు. వైఎస్ పాదయాత్రను కూడా ఇలాగే అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. నాడు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారని సురేఖ గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఫిర్యాదులు ఎందుకని ఆమె నిలదీశారు. టీఆర్ఎస్‌ను గద్దె దించడమే మనందరి లక్ష్యం కావాలని సురేఖ హితవు పలికారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ పరిస్ధితి ఏంటో సీనియర్లు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

వైఎస్ అంటే గిట్టనివాళ్లు కూడా పాదయాత్రలో చేరారని కొండా సురేఖ చెప్పారు. మనమంతా ఒకే వేదిక మీదకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. మరో నేత మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ పాదయాత్ర రైతుల కోసమేనన్నారు.

Also Read:పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదు : రేవంత్ కు కాంగ్రెస్ సీనియర్ల ఝలక్.. !!

రైతుల కోసం చేసే యాత్రకు రాజకీయాలు రుద్దవద్దని ఆయన హితవు పలికారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పాదయాత్రకు కేసీఆర్ అనుమతి ఇవ్వలేదని... తెలంగాణ కోసం అందరికంటే ఉద్యోగులు ఎక్కువ ఉద్యమించారని ఆయన తెలిపారు.

కాగా, తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు గా ఎప్పటినుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైతుల ఉద్యమానికి మద్ధతుగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగియబోతోంది. ఈ యాత్ర ముగింపుకు వచ్చిన తరుణంలో మరోసారి వీరి మధ్య కుమ్మలాటలు బహిర్గతం అయ్యాయి.

తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడుకు పగ్గాలు వేయడం తమ వల్ల కాదని కాంగ్రెస్ సీనియర్లకు అర్థమవుతున్నా ఏదో రకంగా అడ్డంకులు కలిగిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి వీటన్నింటికీ సిద్ధపడే ముందుకు సాగుతున్నారు. ఎక్కడా స్పీడ్ తగ్గకుండా చూసుకుంటూ ముందుకు దూకుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios