గుత్తా... పిల్లికి బిచ్చం పెట్టడు
- గుత్తాపై కోమటిరెడ్డి గరం గరం
- రేవంత్ కొడంగల్ లో గెలవడం ఖాయం
- కేసిఆర్ రాజకీయాలు చూస్తే వైరాగ్యం కలుగుతున్నది.
నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మీద ఫైర్ అయిండు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పిల్లికి బిచ్చం పెట్టని నాయకుడు గుత్తాసుఖేందర్ రెడ్డి అని విమర్శించారు. టిఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత గుత్తాను చూస్తే జాలేస్తుందన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డిని టిఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా గుత్తాకు కేసిఆర్ గట్టి షాకే ఇచ్చిండన్నారు. టిఆర్ఎస్ లో గుత్తా పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుందన్నారు.
రేవంత్ రెడ్డి రాజీనామా ను ఆమోదించుకుంటే ఆయన ఇమేజ్ బాగా పెరుగతదన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కోడంగల్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. రేవంత్ గెలుపుకోసం తామందరం పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ లో వ్యక్తిగతంగా పాదయాత్రలు చేస్తామంటే హైకమాండ్ అనుమతి ఇవ్వదని చెప్పారు.
ఇక కేసిఆర్ మీద కూడా కోమటిరెడ్డి పనిలోపనిగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన చూస్తే తనకు రాజకీయాల పై వైరాగ్యం కలుగుతుందన్నారు. రాజకీయాలను వదిలేసి తన కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తే బాగుండానిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్వాగత్ హోటల్ లో పురుగల చికెన్
ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్
https://goo.gl/Tsck2C