అప్పులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే.... ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఓ సర్పంచ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ జనగామ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది.
వరంగల్: అప్పులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే.... ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఓ సర్పంచ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ జనగామ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తోంది.
జనగామ మండలం కిష్టగూడెం సర్పంచ్ భవాని లేఖ ప్రస్తుతం సర్వత్రా చర్చకు దారితీసింది.అప్పులు తెచ్చి అభివృద్ది చేస్తే ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఆ లేఖలో ప్రశ్నించారు. రూ. 19 లక్షలతో అభివృద్ధి చేస్తే బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు రాకపోవడంతో తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొందన్నారు. ఆత్మహత్యల జాబితాలో తమ పేరు లేకుండా చూడాలని ఆ లేఖలో కోరారు.గ్రామాభివృద్ది కోసం తాము అప్పులు తెచ్చి ఖర్చు చేసినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ అప్పులను తీర్చేందుకు బిల్లులు ఇంకా రాకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నట్టుగా ఆ లేఖలో సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అప్పులు తీర్చలేకపోతే తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. తాాము గ్రామాభివృద్ది కోసం చేసిన డబ్బులను తమకు ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 3, 2020, 12:31 PM IST