Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు: రేపు కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష

:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొనాలని  సీఎం ఆదేశించారు. 

KCR meeting with officials on registrations on dec 19 lns
Author
Hyderabad, First Published Dec 18, 2020, 11:29 AM IST

హైదరాబాద్:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొనాలని  సీఎం ఆదేశించారు. 

also read:రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాలు: సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ సర్కార్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు.  హైకోర్టు కాపీ అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 

హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్నికల్ సమస్యలు ఎదురు కావడంతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవలనే ఈ సమస్యలపై చర్చించింది. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సబ్ కమిటీ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios