Asianet News TeluguAsianet News Telugu

సాగు భూములు లాక్కోవాలనే కామారెడ్డిలో పోటీ : కేసీఆర్ పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్య‌లు

Telangana Congress: కాంగ్రెస్ రైతుల‌కు ఉచిత విద్యుత్‌ ఇవ్వలేద‌న్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు వాదనలను కొట్టిపారేసిన తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి.. రైతులకు ఉచిత విద్యుత్‌ అనే ఆలోచనను సృష్టించి 20 ఏళ్ల క్రితం విజయవంతంగా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేన‌ని అన్నారు.
 

KCR contesting Kamareddy to grab farmland: TPCC chief Revanth Reddy RMA
Author
First Published Nov 15, 2023, 3:22 AM IST

Telangana Assembly Elections 2023: అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ తెలంగాణ‌ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల భూములు లాక్కోవాలని కేసీఆర్ యోచిస్తున్నారనీ, అందుకే కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆరోపించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో కొత్త మాస్టర్ ప్లాన్ సాకుతో రైతుల భూములను లాక్కోవాలని కేసీఆర్ ప్రయత్నించారన్నారు. అయితే, రైతుల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో దానిని తాత్కాలికంగా పక్కన పెట్టారని తెలిపారు.

కామారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. తకుముందు స్టేషన్‌ఘన్‌పూర్‌లో సింగపురం ఇందిరకు మద్దతుగా, వర్ధన్నపేటలో కేఆర్‌ నాగరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిపేట, ఇసాయిపేట, ఫరీద్‌పేట్‌, మాచారెడ్డి, పాల్వంచ గ్రామాల్లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లలో టీపీసీసీ చీఫ్‌ రావు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు పేద కుటుంబాల భూములు లాక్కున్నారని ఆరోపించారు. ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇస్తే కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను తరిమికొడతామ‌ని అన్నారు. కేసీఆర్ గత 40 ఏళ్లుగా అన్ని పదవులు అనుభవించారనీ, అయితే తన పూర్వీకుల కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనాపూర్ గ్రామాన్ని గుర్తు చేసుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ రాజకీయ జీవితాన్ని కోనాపూర్‌ నుంచే కాంగ్రెస్‌ అంతం చేస్తుందనీ, అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగ యువకులను కేసీఆర్‌ మోసం చేశారనీ, కేసీఆర్‌ని అధికారం నుంచి గద్దె దించాక ప్రజల సమస్యలన్నీ తీరుతాయన్నారు. వరి క్వింటాల్‌కు రూ.2000 కూడా రైతులు పొందలేకపోయారు, అయితే, కేసీఆర్ ఫామ్‌హౌస్ నుండి వరి క్వింటాల్‌కు రూ.4,250కి విక్రయించారు. త‌న‌ ఆరోపణ తప్పైతే శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పోలీసులు (కాంగ్రెస్), దొంగల (బీఆర్‌ఎస్‌, బీజేపీ) మధ్య జరుగుతున్నాయనీ, ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు టి.రాజయ్య, క‌డియం శ్రీహరిల విశ్వసనీయతపై రేవంత్‌రెడ్డి ప్రశ్నలు గుప్పించారు. "ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్.. వారి క్యారెక్టర్ గురించి తెలుసుకుని వారిని తొలగించారని.. కేసీఆర్ వారిపై నమ్మకం లేనప్పుడు.. ప్రజలకు వారిపై నమ్మకం ఎలా ఉంటుంది?" అని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ హామీలు నెరవేర్చలేదని, ఆయన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి, ఒక మూర్ఖుడిని చేశారని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌ ఓటర్లకు వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.  మహాభారతంలో శిశుపాలుడు 100 తప్పులు చేసి ఎలా ఓడిపోతాడో.. అదే విధంగా సీఎం కేసీఆర్ కూడా 100 తప్పులు పూర్తి చేశారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను గద్దె దించే సమయం వచ్చిందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios