Asianet News TeluguAsianet News Telugu

అప్పు అడిగిన జూనియర్ ఆర్టిస్ట్ ను గదిలో బంధించి అత్యాచారం.. స్నేహితుడితో కూడా గడపాలంటూ...

అప్పు అడిగిన జూనియర్ ఆర్టిస్టును గదిలో బంధించి అత్యాచారం చేశాడో యువకుడు. అంతేకాదు తన స్నేహితుడితో కూడా గడిపితే మరింత డబ్బు ఇస్తానంటూ కండీషన్ పెట్టాడు. 

junior artist raped for asking loan in Hyderabad
Author
Hyderabad, First Published Aug 9, 2022, 7:25 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అమ్మాయిల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్టుపై అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఇందిరా నగర్లో నివసించే యువతి (22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. 

అతను ఆమె అడిగిన డబ్బులు ఇస్తానని.. లోపలికి రమ్మని పిలిచాడు. అతడిని నమ్మి లోపలికి వెళ్లిన ఆమెను బాలునాయక్ ఒక గదిలో బంధించాడు. ఆ తరువాత ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.  అంతేకాదు అక్కడే ఉన్నస్నేహితుడితో కూడా గడిపితే రూ.5వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఇద్దరు వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు.. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ : బంపర్ ఆపర్లిచ్చిన TSRTC.. ఆగస్ట్ 15న పుడితే 12యేళ్లు వచ్చేదాకా ఉచిత ప్రయాణం..ఇంకా...

ఇదిలా ఉండగా, సోమవారం బంజారాహిల్స్ లో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి కాపలాదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తన్న చిన్మయి సైక్యా(22)తో పరిచయం ఏర్పడింది. యువతి మీద కన్నేసిన అతడు ఈ నెల 4న ఆమె ఇట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అత్యాచారినికి పాల్పడ్డాడు. 

బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేక.. మరుసటి రోజు ‘తనకు చనిపోవాలని ఉందంటూ’.. స్నేహితురాలికి ఫోన్ లో మెసేజ్ పంపింది. ఆమె బాధితురాలి సోదరికి చెప్పటంతో ఈ దారుణం బయటపడింది. బాధితరురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ సీఐ ఎం.నరేందర్ తెలిపారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

కాగా, ఆగస్ట్ 6న వరంగల్ లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి.. గర్బం దాల్చడంతో తల్లి, సోదరి సాయంతో అక్రమంగా తొలగించిన ఘటన బాలాజీనగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడు కక్కెర్ల ఆకాష్‌గా మైనర్‌ను ప్రేమ పేరుతో నమ్మించి ట్రాప్‌ చేశాడు. తన పుట్టినరోజు అంటూ ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆకాష్ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 

ఈ విషయం తెలియగానే ఆకాష్ తన తల్లి, సోదరి సహాయంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ దగ్గర రెండు నెలల క్రితం అక్రమంగా అబార్షన్ చేయించాడు. అయితే అబార్షన్ చేయించేవరకు కూడా మైనర్ బాలికపై ఆకాష్ అత్యాచారం కొనసాగించాడు. బాలిక బలహీనంగా అవుతుండడంతో గమనించిన తల్లి ఏమయిందని నిలదీసింది. దీంతో ఆ అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. బాలిక తల్లిదండ్రులు ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కె. గిరి కుమార్ ఆకాష్, అతని తల్లి, సోదరిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించినందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఆర్‌ఎంపీని కూడా పోలీసులు పట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios