Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 16న తెలంగాణకు జేపీ నడ్డా.. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.

JP Nadda Likely To Visit Telangana On 16th December
Author
First Published Dec 5, 2022, 12:38 PM IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. జేపీ నడ్డా పాదయాత్ర ముగింపు సభకు హాజరుకానున్న నేపథ్యంలో.. బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్‌ను అందుకు తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఇక, గతకొంతకాలంగా తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకులు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే సాధించడమే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios