Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు శుభవార్త..

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు హాజరు కాలేకపోయిన విద్యార్థులను, మాల్ ప్రాక్టీస్ తో పరీక్షలకు దూరమైన విద్యార్థులకు గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. 

Intermediate public examinations 2020 - exending the benefit of grace pass marks to the 27589 students - bsb
Author
Hyderabad, First Published Nov 3, 2020, 3:46 PM IST

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు హాజరు కాలేకపోయిన విద్యార్థులను, మాల్ ప్రాక్టీస్ తో పరీక్షలకు దూరమైన విద్యార్థులకు గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ అవకాశం ఈ ఒక్కసారి మాత్రమే కల్పిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కరోనా నేపథ్యంలో మళ్లీ పరీక్షలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 27, 589మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వబోతున్నారు.

ఈ యేడాది మర్చిలో జరిగిన ఎగ్జామ్స్ కు హాజరుకాలేకపోయిన 27, 251 మంది విద్యార్థులు. మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్షలనుండి బహిష్కరించబడిన 338మంది విద్యార్థులు గ్రేస్ పాస్ మార్కులు పొందబోతున్నారు. 

ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ తదుపరి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తెలంగాణ గవర్నర్ పేరిట ఈ ఆర్డర్ రిలీజ్ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios