కంటి వెలుగులో మారిన భర్త: ఏజెన్సీలకు నోటీసులు జారీ
కంటి వెలుగు-రైతు బీమా పథకాలపై ఈ నెల 14న పత్రికలలో జారీ చేసిన రెండు ఏజెన్సీలకు నోటీసు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్: కంటి వెలుగు-రైతు బీమా పథకాలపై ఈ నెల 14న పత్రికలలో జారీ చేసిన రెండు ఏజెన్సీలకు నోటీసు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కంటి వెలుగు- రైతు బీమా పథకాల అడ్వర్టయిజ్మెంట్లో మహిళకు సంబంధించి ప్రచురించిన ఫోటో విషయమై పూర్వపరాలు తెలియజేయాలని, ఫోటో వినియోగించేందుకు సంబంధిత మహిళ లేదా వారి కుటుంబం నుండి పొందిన అనుమతి వివరాలు సోమవారం మధ్యాహ్నంలోగా సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిపింది.
పూర్వపరాలు, వాస్తవాలు సంబంధిత ఏజెన్సీల నుండి అందిన అనంతరం అనుమతి లేకుండా ఫోటో వినియోగించినందుకు గాను ఆ ఏజెన్సీలపై చర్య తీసుకుంటామని సమాచార శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ కథనం చదవండి:
అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు(వీడియో)