Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో ఐటీ సోదాలు: కోమటిరెడ్డి బంధువు ఇంట్లో తనిఖీలు

హైద్రాబాద్ లో  కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, రియల్ ఏస్టేట్ వ్యాపారుల ఇళ్లలో  ఆదాయ పన్ను శాఖ అధికారుల  సోదాలు కలకలం రేపుతున్నాయి.  ఎన్నికల సమయంలో  ఈ సోదాలు చర్చకు దారి తీశాయి.

 income tax department conducts Raid in Komatireddy Venkat reddy Relative house lns
Author
First Published Nov 2, 2023, 12:30 PM IST

హైదరాబాద్:భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో  గురువారంనాడు  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గిరిధర్ రెడ్డి  రియల్ ఏస్టేట్  వ్యాపారం చేస్తున్నారు. హైద్రాబాద్ కోకాపెట్ హిడెన్ గార్డెన్ లోని గిరిధర్ రెడ్డి నివాసంలో ఈ సోదాలు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం నుండి  హైద్రాబాద్ నగరంలో  పలువురిర ఇళ్లలో  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  బడంగపేట మున్సిపల్ చైర్ పర్సన్ పారిజాత నర్సింహరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  నివాసంలో  ఐటీ  అధికారులు సోదాలు  చేస్తున్నారు.  మరోవైపు  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంధువు గిరిధర్ రెడ్డి ఇంట్లో కూడ  సోదాలు చేస్తున్నారు. గిరిధర్ రెడ్డి వ్యాపార లావాదేవీలు,  పన్ను చెల్లింపుల వంటి అంశాలను ఆదాయ పన్ను శాఖాధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. 

also read:హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు.. కళామందిర్ సంస్థలో కొనసాగుతున్న తనిఖీలు..!

హైద్రాబాద్ లో గతంలో కూడ ఐటీ అధికారులు  సోదాలు నిర్వహించారు. అయితే  ఎన్నికల సమయంలో  ఐటీ అధికారుల సోదాలు  చర్చకు దారితీశాయి. ఇవాళ  కాంగ్రెస్ పార్టీకి చెందిన  నేతల ఇళ్లలోనే ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. బీఆర్ఎస్ కోసం  బీజేపీ  నాయకత్వం తమ పార్టీకి చెందిన నేతల ఇళ్లలో ఐటీ అధికారులతో సోదాలు చేయిస్తుందని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

ఈ ఏడాది జూన్ 14న  బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డితో పాటు సిబ్బంది ఇళ్లలో కూడ  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.  పైళ్ల శేఖర్ రెడ్డి  పెట్టుబడులు పెట్టారనే అనుమానంతో  15 సంస్థల్లో సోదాలు నిర్వహించారు.  పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో  పైళ్ల శేఖర్ రెడ్డికి వాటాలున్నాయని  ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5న హైద్రాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  మాగంటి గోపినాథ్  సోదరుడి నివాసంలో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ ఏడాది మే 2న హైద్రాబాద్ లోని పలు  ప్రముఖ వస్త్ర దుకాణాల్లో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.హైద్రాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్టణంలలో  కూడ ఐటీ అధికారులు సోదాలు చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios