Asianet News TeluguAsianet News Telugu

అడ్డంవస్తే తొక్కుకొంటూ గజ్వేల్‌కి వస్తా: మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి

వచ్చే నెలలో గజ్వేల్ కి వస్తానని  అడ్డం వచ్చినవారిని తొక్కుకొంటూ వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడు చింతలపల్లిలో ఆయన 48 గంటల దీక్షను ఆయన ప్రారంభించారు.

I wil come to Gajewel next month says TPCC chief Revanth Reddy
Author
hyderabad, First Published Aug 24, 2021, 5:00 PM IST

హైదరాబాద్: వచ్చే నెలలో గజ్వేల్ గడ్డ మీదికి వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అడ్డం వచ్చే టీఆర్ఎస్  శ్రేణులను తొక్కుకుంటూ వెళ్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ అలా చేయకపోతే  అక్కడే గుండు గీయించుకొంటానని ఆయన ప్రకటించారు.

also read:అలా అయితే రాజీనామా చేస్తా, చర్చకు సిద్దమా?: మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్షలో రేవంత్

కేసీఆర్ దత్తత తీసుకొన్న మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  దళిత గిరిజన దీక్షను  మంగళవారం నాడు ప్రారంభించారు. 48 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారు. తాను ఈ దత్తత గ్రామాల్లోకి రాకుండా ఉండాలని కొందరితో తనపై విమర్శలు చేయించాడని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ విమర్శలపై తాను ఇక్కడి నుండి మాట్లాడేందుకే  ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఆయన చెప్పారు. 

తనపై విమర్శలు చేసిన గ్రామాలకు రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు పన్నాగం పన్నారన్నారు.  ఫామ్‌హౌస్‌ పక్కకు వచ్చి ఈ విమర్శలకు సమాధానం  చెప్పేందుకే తాను ఇంతకాలం నోరు తెరవలేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు.  కేసీఆర్ దత్తత తీసుకొన్నా ఈ గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ జెండాకే అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios