Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిది మందిని నేనే చంపా: గొర్రెకుంట హత్యలపై కోర్టులో సంజయ్

గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసినట్టుగా నిందితుడు సంజయ్ కుమార్ కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ కేసులో తుది తీర్పు బుధవారం నాడు ఇవ్వనుంది. దీంతో నిందితుడిని పోలీసులు వరంగల్ కోర్టులో హాజరుపర్చారు.  

I killed nine members gorrekunta accused Sanjay says to warangal court lns
Author
Warangal, First Published Oct 28, 2020, 1:24 PM IST

వరంగల్: గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసినట్టుగా నిందితుడు సంజయ్ కుమార్ కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ కేసులో తుది తీర్పు బుధవారం నాడు ఇవ్వనుంది. దీంతో నిందితుడిని పోలీసులు వరంగల్ కోర్టులో హాజరుపర్చారు.  

also read:వరంగల్ గొర్రెకుంటలో 9 హత్యలు: నేడు కోర్టు తీర్పు

ఈ ఏడాది మే 21వ తేదీన గొర్రెకుంటలో ఆలం కుటుంబానికి చెందిన సభ్యులు  ఏడుగురు, బీహార్ కు చెందిన శ్యాం, శ్రీరామ్ లు మరణించారు. వీరిని  సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేశాడు. గొర్రెకుంట బావిలో వేశాడు. 

ఈ కేసులో నిందితుడిగా సంజయ్ కుమార్ ను 72 గంటల్లో గుర్తించారు. నిందితుడిపై చార్జీషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై ఇవాళ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. నిందితుడు సంజయ్ కు ఉరిశిక్ష పడాలని వాదించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే ఈ హత్యలు చేసినట్టుగా జడ్జి ముందు నిందితుడు సంజయ్ కుమార్ ఒప్పుకొన్నాడు.ఈ కేసులో నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో నిరూపించాడు. నేరం రుజువైందని జిల్లా కోర్టు ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios