సికింద్రాబాద్ రాంగోపాల్పేట్లోని Tequila Pub టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. పబ్పై దాడి చేసిన పోలీసులు.. 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్పేట్లోని Tequila Pub టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. పబ్పై దాడలు చేశారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో పబ్లో యువతులు అశ్లీల నృత్యాలు గుర్తించనట్టుగా సమాచారం. యువతులతో అశ్లీల నృత్యాలు, late night nuisance నేపథ్యంలో పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నారు.
ఇందుకు సంబంధించి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ను నిర్వహిస్తున్నారని తేల్చిన పోలీసులు పబ్ను సీజ్ చేసినట్టుగా తెలిపారు. పబ్లోని సౌండ్ సిస్టమ్ను సీజ్ చేశారు. ఇక, నిబంధనలకు విరుద్దంగా అర్దరాత్రి దాటిన తర్వాత టేకిలా పబ్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. పబ్లో నిర్ణీత సమయాలను ఉల్లంఘించి పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించినట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్లో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్పై ఆకస్మికంగా దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఐదు గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో పట్టుబడినవారిని విచారణ అనంతరం పోలీసులు వదిలిపెట్టారు. దాడి సమయంలో పబ్లో సిబ్బందితో సహా దాదాపు 150 మంది ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. పబ్లో జరిగిన లేట్ నైట్ పార్టీలో టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు బంధువులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు.
పోలీసులు దాడి సమయంలో పోలీసులు ఒక డిస్క్ జాకీ పాటలు ప్లే చేస్తుండగా.. కస్టమర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. అక్కడి టేబుల్పై వివిధ రకాల ఆకులు, ఇతర పదార్థాలు కూడా కనుగొనబడ్డాయని చెప్పారు. సోదాల్లో కొకైన్ దొరికిందని వెల్లడించారు. కస్టమర్లందరూ డ్రగ్స్ వాడినట్లు తెలియకపోవడంతో వారిని నిందితులుగా చేయలేదని జోయెల్ చెప్పారు.పబ్లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ వినియోగించేవారని.. కోడ్ చెప్పినవాళ్లకే పబ్లోకి అనుమతిస్తున్నారని డీసీపీ చెప్పారు. పబ్కి వచ్చే వారికి ఓటీపీ ఇచ్చి.. దాని ద్వారానే ఎంట్రీ ఇస్తున్నారని డేవిస్ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే వారిని అదుపులోకి తీసుకుంటామని జోయల్ డేవిస్ చెప్పారు.
