టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళవారం నాడు హైద్రాబాద్ పోలీసులు తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిలను పురస్కరించుకొని పోలీసులు ఈ కాన్వాయ్ ని తనిఖీ చేశారు.
హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళవారం నాడు హైద్రాబాద్ పోలీసులు తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిలను పురస్కరించుకొని పోలీసులు ఈ కాన్వాయ్ ని తనిఖీ చేశారు.
హైద్రాబాద్ నుండి విజయవాడకు లోకేష్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేశామని పోలీసులు ప్రకటించారు.
వీడియో
"
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైద్రాబాద్ లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ దఫా టీడీపీ కూడా పోటీ చేస్తోంది. టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఒక్క కార్పోరేట్ స్థానంలోనే విజయం సాధించింది.2014 నుండి తెలంగాణలోని టీడీపీ నేతలు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో ఆ పార్టీ బలహీనపడింది.కీలక నేతలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 24, 2020, 11:28 AM IST