ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం.. న్యాయం జరగడం లేదంటూ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధికారిక నివాసం ప్రగతి భవన్ (Pragati bhavan) ముందు ఓ కుటుంబం ఆత్మహత్యయత్నానికి (Suicide attempt) పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు (Ibrahimpatnam) చెందిన భార్యభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆత్మహత్యకు యత్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధికారిక నివాసం ప్రగతి భవన్ (Pragati bhavan) ముందు ఓ కుటుంబం ఆత్మహత్యయత్నానికి (Suicide attempt) పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు (Ibrahimpatnam) చెందిన భార్యభర్తలు, వారి ముగ్గురు పిల్లలు శనివారం ప్రగతిభవన్ వద్దకు చేరుని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిపై నీళ్లు పోశారు. ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. తమ ఐదెకరాల భూమి కబ్జాకు గురైందని.. ఎవరికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆత్మహత్యకు యత్నించిన దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు.