Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ: హెచ్ సీ ఏ పై మరో కేసు

ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సమయం తప్పుగా ముద్రించారని బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. . ఈ మేరకు ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Hyderabad Begumpet Police Files Case Against HCA
Author
First Published Sep 28, 2022, 9:27 AM IST

హైదరాబాద్:హెచ్ సీ ఏ పై మరో కేసు 
నమోదైంది.ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగిన  ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు  సంబంధించి న సమయాన్ని టికెట్లపై తప్పుగా ముద్రించారని  బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఈ నెల 22న జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా  హెచ్  సీ ఏ పై మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు నమోదైంది.  ఈ నెల 25 న జరిగిన ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయానికి సంబంధించి మొదటి నుండి గందరగోళం చోటు చేసుకుంది. టికెట్ల విక్రయాన్ని పేటీఎంకు కాంట్రాక్టుకు ఇచ్చినందున తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్  సీ ఏ ప్రకటించింది.,  మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తాము ఏర్పాట్లు చేశామని హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్ చెప్పారు.  ఉఏప్పల్  స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన సమయం తప్పుగా ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 25వ తేదీన రాత్రి ఏడుగంటలకే మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టికెట్లపై మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్నట్టుగా సమయం ముద్రించారని  ఆ యువకుడు బేగంపేట పోలీసులకు పిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ నెల 22న జింఖానా గ్రౌండ్స్ లో ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్   టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారికి వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చులను హెచ్  సీ ఏ భరిస్తామని ప్రకటించింది. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios