పోలీస్ వాహనంలో యువకుల హల్చల్: సీఐకు మెమో
పోలీసు పెట్రోలింగ్ వాహనంతో రోడ్డుపై యువకులు హల్ చల్ చేసిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సీఐపై పోలీసు ఉన్నతాధికారులు మోమో జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్: పోలీసు పెట్రోలింగ్ వాహనంతో రోడ్డుపై యువకులు హల్ చల్ చేసిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సీఐపై పోలీసు ఉన్నతాధికారులు మోమో జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
శుక్రవారం రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో యువకులు హల్ చల్ చేశారు. హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ సీఐ శనివారం నాడు సెలవులో ఉన్నాడు. అయితే సీఐ సెలవులో ఉన్నందున వాహనాన్ని కంట్రోల్ రూమ్లో అప్పగించాలి. ఈ వాహనం డ్రైవర్ తన ఇంటికి వాహనాన్ని తీసుకెళ్లాడు. తన కొడుకుకు వాహానాన్ని అప్పగించాడు.
వాహనాన్ని కంట్రోల్రూమ్లో అప్పగించి రావాలని కొడుకుకు వాహానాన్ని ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి వాహనాన్ని తీసుకెళ్లాడు. ఎల్బీనగర్ నుండి మలక్పేట వైపు వెళ్లే దారిలో ఈ వాహనంలో యువకుల ఆగడాలపై మీడియాలో వార్తలు వచ్చాయి.
దీంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హైద్రాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ పరిధిలో పనిచేసే సీఐ ఉపయోగించే వాహనంగా గుర్తించారు. ఈ వాహనాన్ని ఉపయోగించే సీఐకు పోలీసు ఉన్నతాధికారులు మోమో జారీ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు.ఈ విచారణ రిపోర్ట్ ఆధారంగా సీఐపై చర్యలు తీసుకొంటామని హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు.