హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ .. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్పై 24,068 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి బీజేపీనే ఆధిక్యంలో వుంటూ వచ్చింది. మొత్తంగా బీజేపీకి 1,06,780 ఓట్లు రాగా.. టీఆర్ఎస్కు 82,712 ఓట్లు పోలయ్యాయి.
Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఈటలదే.. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

కరీంనగర్: తెలంగాణ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం నేడు(మంగళవారం) వెలువడనుంది. ఈ ఫలితంతో తెలంగాణ రాజకీయాలు మరో మలుపుతిరిగే అకవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో యావత్ రాష్ట్రం చూపంతా హుజురాబాద్ వైపే వుంది. ఇటు అధికార టీఆర్ఎస్, అటు ప్రతిపక్ష బిజెపితో తమదంటే తమదే విజయమన్న ధీమాతో వుంటే... ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఫలితంపై స్పష్టమైన అంచనా వేయలేకపోయింది. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తయితేనే విజయం ఎవరిదన్నది తేలనుంది. హుజురాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలనుంది.
హుజురాబాద్ ఈటలదే.. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
ఈటల రాజేందర్ విజయం.. ఇంకా మిగిలేవున్న రెండు రౌండ్ల కౌంటింగ్
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ విజయం ఇక లాంఛనమేప. ఇప్పటికే ఆయన మెజారిటీ 21 వేల మార్క్ను దాటింది. ఇంకా రెండు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి వుంది. అయితే ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈటల విజయం ఖరారైనట్లే. దీనిపై ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
ఈటల పైపైకి, 20వ రౌండ్లోనూ లీడ్.. 21,015 ఓట్ల మెజార్టీతో బీజేపీ
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల 21,015 ఓట్ల మెజార్టీతో వున్నారు. 20వ రౌండ్లో 1,474 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ నిలిచింది.
19 రౌండ్లో ఈటలదే పైచేయి.. 19,541 ఓట్ల మెజారిటీతో బీజేపీ లీడ్
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 19 రౌండ్లు ముగిసే సరికి ఈటలకు 91,312 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్కి 71,771 ఓట్లు పడ్డాయి. 19వ రౌండ్లో బీజేపీకి 3,047 ఓట్లు పడ్డాయి. దీంతో ఈటల 19,541 ఓట్ల మెజారిటీతో వున్నారు.
17వ రౌండ్లో ఈటలదే హవా... భారీ ఆధిక్యం
17వ రౌండ్ లో బిజెపి భారీ ఆధిక్యం సాధించింది. సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల ఈ 17వ రౌండ్ లో 1,423 మెజారిటీ సాధించారు. ఈ రౌండ్ లో BJPకి 5610, TRS కి 4187 ఓట్లు వచ్చాయి. దీంతో బిజెపి ఓట్లు 79,785, టీఆర్ఎస్ ఓట్లు 65,167 కు చేరుకున్నారు. దీంతో ఈటల మొత్తం మెజారిటీ 14,618 చేరింది.
హుజురాబాద్ ఈటలవైపే... ఓటర్ల స్పష్టమైన తీర్పు
ఇప్పటివరకు మొత్తం 16 రౌండ్లు పూర్తవగా ఆరంభంనుండి ఈటల రాజేందర్ ఆధిక్యమే కొనసాగుతోంది. మొత్తంగా 14 రౌండ్లలో బిజెపి మెజారిటీ సాదించగా, కేవలం 2 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది.
16 రౌండ్ లోనూ ఈటలదే పైచేయి
16వ రౌండ్ లో ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్లో 1712 ఓట్ల ఆధిక్యాన్ని బీజేపీ సాధించింది. ఈ రౌండ్ లో BJPకి 5689, TRSకి 3917 వచ్చాయి. దీంతో బిజెపి ఆధిక్యం 13195కు చేరింది. ఈ రౌండ్ తర్వాత బిజెపికి మొత్తం 74,175 ఓట్లు, టీఆర్ఎస్ 60,220 సాధించాయి. కాంగ్రెస్ కు అత్యంత దారుణంగా 2131 ఓట్ల మాత్రమే వచ్చాయి.
15వ రౌండ్ తర్వాత పార్టీలవారిగా ఓట్ల వివరాలు
15వ రౌండ్ ముగిసేసరికి ఈటల పోటీచేసిపి బిజెపికి 68,586 ఓట్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేసిన టీఆర్ఎస్ కు 57,003, కాంగ్రెస్ 1982 ఓట్లు వచ్చాయి.
11వేలు దాటిన ఈటల ఆధిక్యం... ఒకే రౌండ్లో 2149 మెజారిటీ
15వ రౌండ్ లో బిజెపికి భారీ ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 11583 ఓట్లకు చేరింది. ఒక్క 15వ రౌండ్ లోనే ఏకంగా 2,149ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి 5507, టీఆర్ఎస్ కు 3358 ఓట్లు వచ్చాయి.
ఇప్పటివరకు పార్టీలవారిగా వచ్చిన ఓట్లివి...
14వ రౌండ్ తర్వాత బిజెపికి 63079, టీఆర్ఎస్ కి 53627, కాంగ్రెస్ కి 1830 ఓట్లు వచ్చాయి.
14వ రౌండ్ ఈటలదే... గెల్లుపై 1046 ఓట్ల ఆధిక్యం
14వ రౌండ్ లో బిజెపి ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్ లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుపై 1046ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో ఈటల మొత్తం లీడింగ్ 9434కు చేరుకుంది.
13వ రౌండ్ లో ఈటలకు భారీ ఆధిక్యం...
13రౌండ్ లోనూ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి ఏకంగా 1867ఓట్ల ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. 13వ రౌండ్ తర్వాత ఈటల మెజారిటీ 8,388 కు చేరింది. ఈ రౌండ్ లో బిజెపికి 4836, టీఆర్ఎస్ కు 2971 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్ తర్వాత బిజెపి ఓట్లు 58,333, టీఆర్ఎస్ కు 49,945ఓట్లకు చేరాయి.
12వ రౌండ్లో పార్టీలవారిగా ఓట్ల వివరాలు
12వ రౌండ్లో బిజెపికి 4849, టీఆర్ఎస్ కు 3632 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసాక మొత్తంగా బిజెపికి 53,497, టీఆర్ఎస్ కు 46,974ఓట్లుకు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు 1729 చేరాయి.
11వ రౌండ్ వివరాలు

మళ్లీ ఈటలకు ఆధిక్యం
12వ రౌండ్ లో తిరిగి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో 1,217 ఓట్ల ఆధిక్యంలో ఈటల వున్నట్లు తెలుస్తోంది. దీంతో 6,523కు పైగా ఈటల మెజారిటీ దాటే అవకాశం కనిపిస్తోంది.
యాబైవేల ఓట్లకు చేరువలో ఈటల
పదకొండో రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ఈటలకు 48,588 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 43,324 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు కేవలం 2524 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 11వ రౌండ్లో బిజెపికి 3941, టీఆర్ఎస్ కు 4308 ఓట్లు వచ్చాయి.
11వ రౌండ్లో ఆధిక్యంలోకి టీఆర్ఎస్.. అయినా లీడ్లో ఈటల
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 11వ రౌండ్లో టీఆర్ఎస్ 367 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే 11 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.
10వ రౌండ్లోనూ ఈటలదే పైచేయి.. 5,631 ఓట్ల మెజారిటీతో బీజేపీ
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్లో బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పదో రౌండ్లోనూ ఆయనే పైచేయి సాధించారు. 10 రౌండ్లు ముగిసే సరికి ఈటల రాజేందర్ 5,631 ఓట్ల మెజారిటీతో వున్నారు.
తొమ్మిదో రౌండ్ లో ఈటలకు 1835 ఓట్ల ఆధిక్యం
తొమ్మిదో రౌండ్ లో ఈటలకు 1835 ఓట్ల ఆధిక్యం లభించింది.
తొమ్మిదో రౌండ్ ఈటలదే... వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యం
తొమ్మిదో రౌండ్ లో మళ్లీ ఈటలకే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో ఆయన వెయ్యికి పైగా ఓట్ల లీడ్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ తర్వాత ఈటల ఆధిక్యం 5111కు చేరింది.