Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అనుమానం.. 11 నెలల పసికందును నేలకేసి కొట్టిన తండ్రి..

అనుమానం పెనుభూతం అయ్యింది. విచక్షణ కోల్పోయి.. 11నెలల చిన్నారిని నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే.. అసువులు బాశాడు. 
 

husband murder 11 month old baby over suspicious in mancherial
Author
Hyderabad, First Published Apr 26, 2022, 8:35 AM IST

మంచిర్యాల : మంచిర్యాలలో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే అనుమానంతో ఓ చిన్నారి ఉసురు తీశాడు. భార్య మీద అనుమానంతో కడుపున పుట్టిన కొడుకునే 11నెలల చిన్నారిని పాశవికంగా నేలకేసి కొట్టాడు. పట్టరాని కోపంలో చేసిన ఆ పనితో ఆ పసివాడికి నూరేళ్లు నిండాయి. 

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయి భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులిమడుగు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మందమర్రి మండలం pulimaduguకు చెందిన నరేష్, జ్యోతి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 11నెలల బాబు ఉన్నాడు. నరేష్ ఇసుక బట్టిలో పనిచేస్తాడు. అయితే, ఈ క్రమంలో తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇంట్లో ఆమెతో తరచూ ఈ విషయంగా గొడవపడుతూ ఉండేవాడు.  

అదే సమయంలో ఆదివారం అర్ధరాత్రి తాగి వచ్చిన నరేష్ భార్యతో మల్లోసారి ఘర్షణ పడ్డాడు. ఇష్టానుసారం కొడుతూ భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి బాదాడు. అనుకోని ఈ పరిణామానికి భార్య తేరుకునేలోపే.. చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూసాడు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

ఇదిలా ఉండగా, భర్తతో గొడవపడి ఓ మహిళ తన మూడు నెలల పసికందును గొంతు కోసి murder చేసిన ఘటన న్యూ ఢిల్లీలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు ఏప్రిల్ 6న వివరాలు వెల్లడించారు. వాయువ్య ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన నిందితురాలు అంజలీ దేవి(26)ని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2.14 గంటలకు పసికందును ఆమె తల్లి హత్య చేసినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ తన మెడలోని దారంతో శిశువు గొంతుకు బిగించి చంపినట్లు తెలిసింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగాని తెలిపారు.

ఘటన జరిగిన రోజు ఉదయం దేవికి ఆమె భర్తకు ఏదో విషయం మీద గొడవ జరిగింది. ఆ తరువాత భర్త తన పనికి వెళ్లిపోయాడు. అయితే గొడవ విషయంలో భర్త మీద విసుగ్గా ఉన్న భార్య... ఆవేశానికి లోనై పసికందును హత్య చేసినట్టు ఆమె తెలిపిందన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశామని, నిందితురాలిని అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. "చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపాం, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం" అని డిసిపి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios