హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. దీనికి కౌంటర్‌గా మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ యత్నించింది.

హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాలు గురువారం ఆందోళనలు నిర్వహించాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. దీనికి కౌంటర్‌గా మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ యత్నించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్ధి సంఘాలను అడ్డుకున్నారు. క్యాంపస్‌లో సినిమా ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. అనంతరం ఫిల్మ్ ప్రొజెక్టర్‌ను సీజ్ చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో హెచ్‌సీయూలో భారీగా పోలీసులు మోహరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred