గోపన్పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు
గోపన్ పల్లి భూముల విషయంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
హైదరాబాద్: గోపన్ పల్లి భూముల విషయంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
గోపన్పల్లి భూముల వ్యవహరంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. గురువారం నాడు ఈ భూముల విషయమై హైకోర్టులో రేవంత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Also read:గోపన్పల్లి భూములు: హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి
ఈ పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. ఈ భూముల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని హైకోర్టు సూచించింది.
మరో వైపు తమకు ఎలాంటి నోటీసులు కూడ ఇవ్వలేదని ఏపీ హైకోర్టుకు రేవంత్ తరపున న్యాయవాది గుర్తు చేశారు. అయితే ఈ విషయమై ప్రభుత్వ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని ఏ చర్యలు తీసుకొన్నా కూడ ముందుగా రేవంత్ రెడ్డి సోదరులకు నోటీసులు ఇస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.ఈ కేసు విచారణను హైకోర్టు ముగించింది.