Asianet News TeluguAsianet News Telugu

తెరపైకి ఓటుకు నోటు కేసు: ఈ నెల 12 నుండి రోజువారీ విచారణ

ప్రజా ప్రతినిదులపై నమోదైన కేసులను  సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో  ఓటుకు నోటు కేసును  ఈ నెల 12వ తేదీ నుండి రోజు వారీగా విచారించనుంది కోర్టు.

Hearing for cash-for-vote case adjourned on oct 12 lns
Author
Hyderabad, First Published Oct 9, 2020, 5:36 PM IST


హైదరాబాద్: ప్రజా ప్రతినిదులపై నమోదైన కేసులను  సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో  ఓటుకు నోటు కేసును  ఈ నెల 12వ తేదీ నుండి రోజు వారీగా విచారించనుంది కోర్టు.

ఈ కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించింది. ఈ విచారణలో ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అత్యంత కీలకం కానుంది.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధికి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తుండగా  రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో తనను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని రేవంత్ రెడ్డి అప్పట్లోనే ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ  కేసులో పలువురు ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ కేసు విచారణపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రోజువారీగా ఈ కేసు విచారణ సాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులపై సుమారు 4857  కేసులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టు కు అమికస్ క్యూరీ తెలిపింది.

యూపీ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులపై అత్యధిక కేసులున్నాయి. ఆ తర్వాతి స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios