గొర్రెకుంటలో 9 మంది హత్య: సంజయ్ కు ఉరిశిక్ష విధించిన కోర్టు
వరంగల్: గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో దోషి సంజయ్ కుమార్ కు వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు బుధవారం నాడు ఉరిశిక్ష విధించింది
వరంగల్: గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో దోషి సంజయ్ కుమార్ కు వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు బుధవారం నాడు ఉరిశిక్ష విధించింది
ఈ ఏడాది మే 21వ తేదీన సంజయ్ కుమార్ 9 మందిని హత్య చేశాడు. ఈ ఏడాది మే 21వ తేదీన గొర్రెకుంటలో ఆలం కుటుంబానికి చెందిన సభ్యులు ఏడుగురు, బీహార్ కు చెందిన శ్యాం, శ్రీరామ్ లు మరణించారు. వీరిని సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేసి. గొర్రెకుంట బావిలో వేశాడు.
also read:తొమ్మిది మందిని నేనే చంపా: గొర్రెకుంట హత్యలపై కోర్టులో సంజయ్
ఒక హత్య ను కప్పిపుచ్చేందుకు 9 మందిని సంజయ్ కుమార్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.25 రోజుల్లోనే ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. 57 మంది వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు కేసు నుండి తప్పించుకోకుండా పోలీసులు పక్కాగా సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరిశిక్షను విధించింది.
ఈ కేసులో నిందితుడిగా సంజయ్ కుమార్ ను 72 గంటల్లో గుర్తించారు. నిందితుడు సంజయ్ కు ఉరిశిక్ష పడాలని వాదించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే ఈ హత్యలు చేసినట్టుగా జడ్జి ముందు నిందితుడు సంజయ్ కుమార్ ఒప్పుకొన్నాడు.ఈ కేసులో నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో నిరూపించాడు. నేరం రుజువైందని జిల్లా కోర్టు ప్రకటించింది.