సింగరేణి కార్మికులకు శుభవార్త
- దసరాకు అడ్వాన్స్ 7వేలు పెంపు (గతం కంటే)
- దీపావళి బోనస్ 3వేలు పెంపు (గతం కంటే)
- గతం కంటే పెంచిన సర్కార్
- ప్రకటించిన ఎండి శ్రీధర్
తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు శుభవార్త ప్రకటించింది. కార్మికులకు ఈ ఏడాది పండగ బొనస్ ను పెంచింది ప్రభుత్వం.
సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ , దీపావళి బోనస్ ల క్రింద మొత్తం 82 వేల రూపాయలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ రెండింటికి కలిసి 456 కోట్ల రూపాయలు తమ సంస్థ చెల్లించనుందని సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.
దీపావళి బోనస్ ను గతేడాదితో పోలిస్తే 3 వేల రూపాయలు పెంచి 57 వేలు చేశామన్నారు. అలాగే దసరా అడ్వాన్స్ ను 18 వేల నుండి 25 వేలకు పెంచామని శ్రీధర్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ నెల 22 వ తేదీన దసరా అడ్వాన్స్ 25 వేలను , దీపావళి బోనస్ ను అక్టోబర్ 2 వ తేదీన 57 వేలను సింగరేణి ఉద్యోగుల బ్యాంక్ ఎకౌంట్లలో జమచేస్తామని ఆయన తెలిపారు.
అయితే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఈ బోనస్ పెంపు శుభవార్త కార్మికులకు అందడం చర్చనీయాంశమైంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి