Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి కార్మికులకు శుభవార్త

  • దసరాకు అడ్వాన్స్ 7వేలు పెంపు (గతం కంటే)
  • దీపావళి బోనస్ 3వేలు పెంపు (గతం కంటే)
  • గతం కంటే పెంచిన సర్కార్
  • ప్రకటించిన ఎండి శ్రీధర్
good news for singareni workers

తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు శుభవార్త ప్రకటించింది. కార్మికులకు ఈ ఏడాది పండగ బొనస్ ను పెంచింది ప్రభుత్వం.

సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ , దీపావళి బోనస్ ల క్రింద మొత్తం 82 వేల రూపాయలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ రెండింటికి కలిసి  456 కోట్ల రూపాయలు తమ సంస్థ చెల్లించనుందని సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.

దీపావళి బోనస్ ను గతేడాదితో పోలిస్తే 3 వేల రూపాయలు పెంచి 57 వేలు చేశామన్నారు. అలాగే దసరా అడ్వాన్స్ ను 18 వేల నుండి 25 వేలకు పెంచామని శ్రీధర్ తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం  ఈ నెల 22 వ తేదీన దసరా అడ్వాన్స్ 25 వేలను , దీపావళి బోనస్ ను అక్టోబర్ 2 వ తేదీన 57 వేలను సింగరేణి ఉద్యోగుల బ్యాంక్ ఎకౌంట్లలో జమచేస్తామని ఆయన తెలిపారు.

అయితే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఈ బోనస్ పెంపు శుభవార్త కార్మికులకు అందడం చర్చనీయాంశమైంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios