Asianet News TeluguAsianet News Telugu

రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. జీహెచ్ఎంసీ షాక్

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. 

GHMC officers fine to RTC Bus Driver in hyderabad
Author
Hyderabad, First Published Jul 3, 2019, 2:25 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... కుషాయిగూడ బస్ డిపోకు చెందిన డ్రైవర్ జగదీష్... బస్సులో కూర్చొని రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో అప్పుడే రోడ్లను పరిశుభ్రం చేసిన జీహెచ్ఎంసీ కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 

వెంటనే ఈ విషయంపై  ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవర్ జగదీష్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా చెల్లించాలన్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లింగంపల్లిలో ఉన్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి మరీ జరిమానా విధించడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios