Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్‌రేప్..నమ్మిన స్నేహితురాళ్లే ముంచారు

డబ్బు విషయంలో వివాదం జరిగి దానిపై పగ పెంచుకున్న వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన శిరీష, హేమ లంగర్‌హౌస్‌లో ఉంటూ వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది

gangrape by junior artist in hyderabad

డబ్బు విషయంలో వివాదం జరిగి దానిపై పగ పెంచుకున్న వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన శిరీష, హేమ లంగర్‌హౌస్‌లో ఉంటూ వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది.. కొద్దికాలం క్రితం ఆ యువతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెను తనకు దగ్గర్లోని హాస్టల్‌లో చేర్చాడు.

అయితే సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరూ ‘‘మన’’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. సభ్యత్వం కోసం కొంత డబ్బు వసూలు చేశారు. ఈ డబ్బు లెక్కల్లో తేడాలు రావడంతో వారిద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. దీనిని మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్ పగబట్టాడు. ఈ ఏడాది మార్చి 5న సదరు యువతితో పాటు శిరీష, హేమలతో కలిసి గుంటూరు వెళ్లి.. అక్కడ లాడ్జిలో ఉన్నారు. ఈ సమయంలో శిరీష, హేమ ఆ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చారు.

ఆమె స్పృహతప్పి పడిపోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఈ తతంగాన్ని వీడియో తీసి తాను చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.. తనకు అవకాశాలు తగ్గిపోతాయని ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. అయితే రోజు రోజుకు రాజ్‌కిరణ్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు రాజ్‌కిరణ్‌పై కేసు నమోదుచేశారు. ఇతనిపై గతంలోనూ లంగర్‌హౌస్ పోలీస్  స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios