వ్యాపారి గజేంద్ర కిడ్నాప్కు పాల్పడిన నలుగురు అరెస్ట్
వ్యాపారి గజేంద్రను కిడ్నాప్ చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరి పాత్ర కూడ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారి కోసం కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: హైద్రాబాద్ చిక్కడపల్లి వ్యాపారి గజేంద్రను కిడ్నాప్ చేసిన ఆరుగురిని టాస్క్పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం చిక్కడపల్లి వ్యాపారి గజేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. సోమవారం నాడు ఉదయం ఆయనను కిడ్నాపర్లు వదిలేశారు. రూ. కోటి తీసుకొన్న కిడ్నాపర్లు గజేంద్రను వదిలేశారు.
డబ్బుల కోసం పాతబస్తీకి చెందిన ఆరుగురు కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆదివారం రాత్రి గజేంద్రను కిడ్నాపర్లు అరెస్ట్ చేశారు.
సోమవారం ఉదయం గజేంద్రను కిడ్నాపర్లు వదిలేశారు. పాతబస్తీకి చెందిన ఆరుగురిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సంబంధిత వార్తలు
చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్.. రూ.3 కోట్లు డిమాండ్