ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తమను తెలంగాణలో కలపాలని ఐదు గ్రామాల ప్రజలు భద్రాచలంసమీపంలో రాస్తారోకో నిర్వహించారు. 

భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తమ ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని Bhadrachalam వద్ద ఉన్న Andhra Pradesh, Telangana రాష్ట్రాల సరిహద్దుల వద్ద రాస్తారోకో నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Godavariకి ఇటీవల వరదలు రావడంతో ఈ ఐదు గ్రామాలు నీటిలో ముంపునకు గురయ్యాయి. ఈ ఐదు గ్రామాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.. ఈ విషయమై కొన్ని రోజులుగా ఏపీ సరిహద్దుల్లో ఈ గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ప్రాంతంలో ఆందోళనలు నిర్వహించడంపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఏపీ సరిహద్దు నుండి భద్రాచలానికి సమీపంలోని తెలంగాణ సరిహద్దుకు వచ్చిన ఈ ఐదు గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు.భద్రాచలం అభివృద్ది చెందాలన్నా తమకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఈ ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పిచ్చుకల గూడెం, కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాలను ఏపీ నుండి తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. భద్రాచలం వద్ద ఉన్న కరకట్ట విస్తరణ చేయాలంటే ఈ ఐదు గ్రామాలు కూడా తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉంది.ఈ విషయమై ఈ గ్రామాల వద్ద కరకట్ట నిర్మాణం కోసం ఏపీ ప్రజలతో మాట్లాడుతామని కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష తర్వాత మీడియా సమావేఁశంలో KCR ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఐదు గ్రామాలను తమ రాష్ట్రంలో కలపాలని కూడా తెలంగాణకు చెందిన TRS ప్రజా ప్రతినిధులు కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే

also read:మంజీరాకు పోటెత్తిన వరద: ఏడుపాయల ఆలయం తాత్కాలికంగా మూసివేత

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఏపీ ప్రభుత్వంలో ఏడు మండలాలను కలిపారు. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉండే ఈ ఐదు గ్రామాలు కూడా ఏపీలో విలీనమయ్యాయి.ఈ గ్రామాలకు ఏపీ కంటే తెలంగాణలోని భద్రాచలం సమీపంలో ఉంటుంది. అయితే ఇటీవల వచ్చిన వరదలతో ఈ ఐదు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.ఈ విషయమై గత వారంలో ఈ ఐదు గ్రామపంచాయితీలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేశాయి. ఐదు గ్రామాలను ఏపీ నుండి తెలంగాణలో కలపాలని ఆందోళనలకు దిగారు. ఇవాళ భద్రాచలానికి సమీపానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ ఐదు గ్రామాల ప్రజల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఈ ఐదు గ్రామాలను తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసిి మరీ ఈ డిమాండ్ చేశారు. పోలవరం పెంపు విషయమై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు కారణంగానే భద్రాచలం ముంపునకు గురైందని ఆయన ఆరోపించారు.