ఎల్బీనగర్లో సిలిండర్ పేలుడు, పలువురికి గాయాలు
హైద్రాబాద్ ఎల్బీనగర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దాటికి మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్టుగా సమాచారం అందింది.
హైదరాబాద్: హైద్రాబాద్ ఎల్బీనగర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దాటికి మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్టుగా సమాచారం అందింది.
ఎల్బీనగర్లోని గుంటి జంగయ్యనగర్లో సమీప జిల్లాల నుండి వచ్చి నివాసం ఉంటున్నారు. గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం పూట ఈ గుడిసెల్లో సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. సిలిండర్లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెప్పారు.దీంతో గుడిసెల్లో మంటలు చేలరేగాయి. మంటల ధాటికి గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడ పేలాయి.
భారీగా పేలుడు శబ్దం వెలువడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పక్కనే ఉన్న గుడిసెలకు కూడ ఈ మంటలు వ్యాపించాయి.. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రాంతంలో మంటలను ఆర్పారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు.